చివరి ‘థమ్స్‌అప్’ అంటే..ఏంటన్న మహేశ్-రణ్‌వీర్

by  |
చివరి ‘థమ్స్‌అప్’ అంటే..ఏంటన్న మహేశ్-రణ్‌వీర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రపంచంలో చివరగా మగాళ్లం మనమిద్దరమే ఉన్నామనుకుంటా..’ అని రణ్‌వీర్‌సింగ్ అడగ్గా..‘ఇంకెవరైనా ఉంటే..అక్కడే ఉంటారు’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు మహేశ్‌బాబు. వీరిద్దరూ కలిసి చేసిన థమ్స్‌అప్ యాడ్ సంభాషణ ఇది. థమ్స్‌అప్ కంపెనీ, మహేశ్ ట్విట్టర్ వేదికగా న్యూ థమ్స్‌అప్ యాడ్ రిలీజ్ చేశారు.

పూర్తిగా ధ్వంసమైన నగరంలో ఓ బిల్డింగ్‌ వద్ద ‘ప్రపంచంలో చివరగా మగాళ్లం మనమిద్దరమే ఉన్నామనుకుంటా..’ అని రణ్‌వీర్‌సింగ్ అడగ్గా..‘ఇంకెవరైనా ఉంటే..అక్కడే ఉంటారు’ అంటూ మహేశ్ బదులిస్తాడు. అక్కడ్నుంచి ఆ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లగా..అక్కడ డేంజర్ అలర్ట్ సౌండ్స్ వినబడగానే..ఫ్యాక్టరీలో థమ్స్‌అప్ బాటిల్ కోసం..మహేశ్-రణ్‌వీర్ పరిగెడుతారు. అయితే థమ్స్‌అప్ బాటిల్‌ను ఓ జాంబీ తీసుకోగా, రణ్‌వీర్, మహేశ్..దాన్ని కొట్టగా..భయంకరమైన జాంబీలు ఎగబడుతుండగా..పెద్ద స్టీల్ రాడ్ పడేసి..వాటిని అంతమొందిస్తారు.

జాంబీ నుంచి థమ్స్‌అప్ బాటిల్ తీసుకుంటారు. అనంతరం ‘ఇప్పుడు కూడా చివరి మగాళ్లం ఇద్దరమే ఉన్నాం’అని మహేశ్ చెప్పగా..‘ఇది కూడా చివరిదేనా?’ అని రణ్‌వీర్ అడగ్గా..మహేశ్ ‘చివరి థమ్సప్పా? అంటే’ ఏంటని..అంటూ థమ్స్ అప్ తాగుతారు..‘థమ్స్ అప్..టేస్ట్ ది థండర్..లోగోతో’ యాడ్ ముగుస్తుంది.
https://twitter.com/urstrulyMahesh/status/1343127310027743233?s=20


Next Story

Most Viewed