- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటానికి ప్రపంచ దేశాలన్నీ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వరకు ముంబైలోనే ఉన్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇప్పుడు అమెరికాలోని లాస్ఏంజెలీస్లో ఉంది. తన భర్త డేనియల్ వెబెర్, ముగ్గురు పిల్లలు నిషా, నోరా, ఆషర్తో కలిసి ఆమె అక్కడ రిలాక్స్ అవుతోంది. అయితే భారత్తో పోల్చితే అమెరికా తన పిల్లలకు సురక్షిత ప్రాంతమని భావించి అక్కడికి వెళ్లినట్లు సన్నీ తన ఇన్స్టగ్రామ్ పోస్టులోపేర్కొంది. మదర్స్ డే సందర్భంగా ఆమె తన పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది.
అయితే లాక్డౌన్ సమయంలో సన్నీ లియోన్ ఇండియా నుంచి అమెరికాకు ఎలా వెళ్లిందని చాలా మంది తమ బుర్రలకు పదునుపెట్టారు. దీని గురించి అడుగుతూ చాలా మంది అభిమానులు ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. వారిలో ఒక కామెంట్కి సన్నీ లియోన్ రిప్లై ఇచ్చింది. తాను కేఎల్ఎం గవర్నమెంట్ ఫ్లైట్ ద్వారా అమెరికా చేరుకున్నట్లు చెప్పింది. సన్నీ లియోన్, డేనియల్ వెబెర్ ఇద్దరికీ అమెరికన్ పౌరసత్వం ఉంది. 2012లో భారత్కి తమ మకాం మార్చడానికి ముందు వాళ్లు అక్కడే నివాసం ఉండేవారు.