టాలీవుడ్ సింగర్స్‌కు కరోనా!

by  |
టాలీవుడ్ సింగర్స్‌కు కరోనా!
X

టాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే ఎస్ఎస్.రాజమౌళి, అజయ్ భూపతి, బండ్ల గణేష్ లాంటి వారు కరోనా నుంచి బయటపడగా.. గాన గంధర్వుడు ఎస్పీ బాలు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. అభిమానుల ప్రార్థనలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

తాజాగా సింగర్స్ సునీత, మాళవికకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది. లాక్‌డౌన్ తర్వాత కొంతకాలంగా ఇద్దరూ కూడా ఓ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని.. ఈ ప్రోగ్రామ్ వల్లే వారికి కరోనా సోకిందని టాక్. ఇద్దరితో పాటు షోలో పాల్గొన్న మరికొందరికి కూడా పాజిటివ్ వచ్చిందని సమాచారం. దీంతో షోలో పాల్గొన్న వారందరూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Next Story