కోహ్లీ.. మ్యాచ్ గెలవాలంటే వారిద్దరినీ పక్కనపెట్టు : గవాస్కర్

by  |
కోహ్లీ.. మ్యాచ్ గెలవాలంటే వారిద్దరినీ పక్కనపెట్టు : గవాస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్ : యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. వరల్డ్‌కప్ 2021లో మొదటి మ్యాచ్‌లో టీమిండియా.. పాక్‌ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆదివారం(అక్టోబర్ 31) కివీస్‌తో జరిగే మ్యాచ్‌ భారత్‌కు ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండో టీ20 కోసం టీం ఇండియాకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. భారత తుది జట్టులో రెండు మార్పులు చేయాలని సూచించారు.

ఆల్ రౌండర్‌ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయలేని పక్షంలో అతన్ని పక్కన పెట్టాలని అన్నారు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని తీసుకోవాలని చెప్పారు.

Next Story

Most Viewed