ఆ పొలిటీషియన్ల పని పట్టాలంటున్న హీరో

by  |
Suniel Shetty
X

దిశ, సినిమా: హీరో సునీల్ శెట్టి పాండమిక్ టైమ్‌లో పొలిటీషియన్స్ బిహేవియర్‌పై ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చే ప్రతీ రాజకీయ నాయకుడు రాబోయే ఐదేళ్లలో ఎంత డబ్బు సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నారే తప్ప, వ్యవస్థకు ఎలాంటి సేవలు అందించాలనే ఆలోచన చేయడం లేదన్నారు. వారి నిర్లక్ష్యం వల్లే జనాలు.. ఆక్సిజన్, బెడ్, మందులు, వైద్యం ప్రతీ అవసరం కోసం పరుగులు పెట్టాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఎన్నుకుని తప్పు చేశామని, నెక్స్ట్ టైమ్ ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మళ్లీ ఓట్ల కోసం వచ్చే నాయకులను నిజాయితీగా పనిచేయించేలా పరుగులు పెట్టించాలని కోరారు. ఈ కష్టసమయంలో ఒకరికి ఒకరం కలిసి ఉందామని, ఎవరినైనా ఎలాంటి సమయంలోనైనా సహాయం అడిగేందుకు సంకోచించకూడదని విజ్ఞప్తి చేశారు.

Next Story