కరోనా కట్టడికి సన్ టీవీ భారీ విరాళం

by  |
Sun TV
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో సానుభూతి తెలుపుతూ భారత ప్రధానమంత్రి నిధికి అనేకమంది విరాళాలు అందజేస్తున్నారు. కరోనా కట్టడిలో మద్దతుగా నిలుస్తామని, దేశంలోని ప్రస్తుత కొవిడ్​-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తామూ కృషి చేస్తామని పలు దేశాలతో పాటు మన దేశానికి చెందిన ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా.. కరోనా కట్టడిలో భాగంగా సన్ టీవీ పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.30 కోట్ల విరాళం అందజేసింది. ప్రస్తుతం దేశాన్ని కరోనా సునామీ ముంచెత్తింది. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఓవైపు భారీగా పెరుగుతున్న కేసులు, మరణాలు.. మరోవైపు ఆక్సిజన్, మందుల కొరత.. ఇలా భారత్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఇలాంటి సంక్షోభం పరిస్థితుల్లో దేశానికి కాపాడుకునేందుకు ముందుకొచ్చిన సన్ టీవీని పలువురు అభినందిస్తున్నారు.

Sun TV donation



Next Story

Most Viewed