రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో మరో నటికి సమన్లు

by  |
రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో మరో నటికి సమన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్ కుంద్రా పోర్రోగ్రఫీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తు ముమ్మరం చేసి పోలీసులు.. విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురికి సమన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే నటి గెహనా వశిష్టకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేయగా.. తాజాగా మరో నటికి సమన్లు జారీ చేశారు.

నటి షెర్లీన్ చోప్రాకు తాజాగా పోలీసులు సమన్లు జారీ చేశారు. జులై 27 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఆమెను విచారించిన తర్వాత మరికొంతమందిని విచారించే అవకాశముంది. ఈ కేసులో మొదటి నుంచి షెర్లీన్ చోప్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.



Next Story

Most Viewed