ఆమె గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది….

by  |
ఆమె గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది….
X

దిశ ప్రతినిధి, మెదక్:
దుబ్బాకలో సుజాత గెలుపు మహిళల గెలుపుగా చరిత్రలో నిలుస్తుందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన మహిళా బహిరంగ సభకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… చింతమడకలో పుట్టి.. దుబ్బాకలో చదువుకున్న కేసీఆర్ కు దుబ్బాక పైన ప్రేమ ఉంటంది కానీ.. పరాయి నాయకులకు ప్రేమ ఉంటాదా అని హరీశ్ రావు అన్నారు. ఈ విషయాన్ని దుబ్బాక మహిళలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీ వాళ్లు ఏమని ప్రచారం చేస్తారని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ మీటర్లు పెడతామని ఓట్లు అడుగుతారా ? విదేశీ మక్కలు తెచ్చి రైతుల పొట్టలు కొడతామని అడుగుతారా అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed