ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్

by  |
ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్
X

దిశ, ఏపీ బ్యూరో: క్రికెట్​ బెట్టింగ్ కాపురాలను గుల్ల చేయడమే కాదు. ఏకంగా ఇద్దరు యువకుల బలవన్మరణానికి దారితీసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. బెల్లంకొండలో బెట్టింగ్​తో ఇద్దరు యువకులు అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈనెల 9న ఇద్దరు యువకులు సురేష్‌, కొమరయ్య పురుగుల మందుతాగారు. మరుసటి రోజు సురేష్ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొమరయ్య శనివారం మృతిచెందాడు. ఇద్దరూ బెట్టింగులో లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. నిర్వాహకుడికి రూ.30 వేలు ఇచ్చారు. మిగతా సొమ్ము కోసం పట్టుబట్టడంతో గత్యంతరం లేక సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇద్దరి మరణంతో బెల్లంకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed