ప్రకాశం జిల్లాలో విషాదం

by  |
ప్రకాశం జిల్లాలో విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గిద్దలూరు మండలం నరవ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. దంపతులు ఆత్మహత్య చేసుకొని విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Next Story