- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వేములవాడ: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్ పై వచ్చి కొండాపూర్ గ్రామ శివారులో గల ఒయ్యారి గుట్ట వద్ద చెట్టుకు ఉరేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సిరికొండ మండలం చీమనపల్లి గ్రామానికి చెందిన మిల్క్ రవీందర్ రెడ్డి (40)అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు.
గతంలో చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై మూడు రోజుల క్రితం హైదరాబాదు నుండి బైక్ పైన తన స్వగ్రామమైన చీమన పల్లికి వెళ్లేందుకు కోనరావుపేట మండలం మీదుగా వెళ్తుండగా కొండాపురం గ్రామ శివారులో గల గుట్ట వద్ద చెట్టుకు ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. గుట్ట వద్దకు మేత కోసం పశువులను తీసుకెళ్లగా అక్కడ ఆగి ఉన్న బైక్ చూసిన పశువుల కాపరి గ్రామస్థులకు తెలిపాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.