హిజ్రాగా మార్చారు.. చనిపోతున్నా!..

by  |
హిజ్రాగా మార్చారు.. చనిపోతున్నా!..
X

దిశ, వెబ్‌డెస్క్: హిజ్రాగా మారిన మహబూబ్‌నగర్ జిల్లా వాసి కడప జిల్లాలో సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల నక్కలబండ తండాకు చెందిన 18ఏళ్ల శ్రీకాంత్‌‌కు తల్లిదండ్రులు చనిపోయారు. తమ్ముడితో కలిసి అమ్మమ్మ దగ్గర ఉంటున్న క్రమంలోనే ఏడాదిక్రితం అదృశ్యమయ్యాడు. బంధువులు ఎంత వెతికినా శ్రీకాంత్ ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఫిబ్రవరి 4న మేనమామ కొడుకు వినోద్‌కు వీడియో కాల్‌చేసి నేను ప్రజెంట్ కడప ఏఎస్‌ఆర్ కాలనీలో ఉంటున్నాను.

నన్ను కొందరు ఇక్కడికి తీసుకువచ్చి హిజ్రాగా మార్చారు. నాతో పాటు మరో ముగ్గురు యువకులను కూడా హిజ్రాగా మార్చారు. నా పేరు శ్రీలేఖగా మార్చారని చెప్పుకుంటూనే పురుగుల మందు తాగాడు. నేను ఒక యువకుడిని ప్రేమిస్తే మోసం చేసి ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక పోతున్నా అని ఏడ్చుకుంటూ స్పృహ తప్పిపోయాడు. వెంటనే జడ్చర్ల పోలీసుల సాయంతో కడప పోలీసులను ఆశ్రయించగా కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story