తొగుట మండలంలో రైతు ఆత్మహత్య

by  |
తొగుట మండలంలో రైతు ఆత్మహత్య
X

దిశ, గజ్వేల్: అప్పులబాధ తాళలేక తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లి మధిర వడ్డెరకాలనీకి చెందిన పల్లపు చంద్రం (32) అనే రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రైతు పల్లపు చంద్రంకు రెండెకరాల భూమి ఉంది. నీళ్ల కోసం బోర్లు వేయగా, పడకపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. వీటికి తోడు అతనికి ఉన్న భూమి నుంచి దాదాపు 20 గుంటలు మల్లన్నసాగర్ కాలువలో పోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే అప్పులకు వడ్డీలు పెరగడంతో ఒత్తిడికి గురైన చంద్రం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు వివరించారు. రైతు పల్లపు చంద్రంకు భార్య రేణుక, కుమారులు గణేశ్, రవీందర్ ఉన్నారు.

Next Story

Most Viewed