రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యయత్నం..

by  |
రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యయత్నం..
X

దిశ, సిద్దిపేట: అన్నదమ్ముల మధ్య ముదిరిన అస్థి వివాదం కాస్త తమ్ముడి ఆత్మహత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళ్ళితే.. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలో అంబటి నారాయణ, రాములు ఇరువురు అన్నదమ్ములు.. వారి తండ్రి పేరుమీద ఉన్న ఇంటిని ఇద్దరూ పంచుకున్నారు. నారాయణ, తమ్ముడికి 30వేల రూపాయలు బాకి పడ్డాడు. ఈ క్రమంలో నారాయణ కూతురికి పెళ్లి నిశ్చితార్థం అయ్యింది.తన పేరు మీద ఉన్న భూమిని తాకట్టు పెట్టి పెళ్లి చేద్దామనుకున్న నారాయణ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్ళాడు. ఇది తెలుసుకున్న తమ్ముడు రాములు అక్కడికి వెళ్లి 30,000 ఇవ్వవలసిందిగా కోరాడు. ఖర్చులు ఉన్నాయి అని, పెళ్లి తర్వాత ఇస్తాను అని చెప్పగా దానికి ససేమిరా అన్న తమ్ముడు రాములు తనతో పాటు తెచ్చుకున్న డీజిల్ ఒంటిమీద మీద పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

అది గమనించిన చుట్టుప్రక్కల వారు అడ్డుకొని వాదించారు. రాములును ఒప్పించి గ్రామంలో చర్చించుకుందాం అని ఇంటికి తీసుకెళ్లారు.

Next Story