కత్తితో పీక కోసుకున్న యువకుడు

by  |
కత్తితో పీక కోసుకున్న యువకుడు
X

దిశవాజేడు: మద్యం మత్తులో ఓ యువకుడు కత్తితో పీక కోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామంలో చోటు చేసుకుంది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరూరు గ్రామానికి చెందిన అరికిళ్ళ లోకనాథం అనే యువకుడు గత కొద్ది సంవత్సరాలుగా మద్యానికి బానిస అయ్యాడు. అయితే సోమవారం రాత్రి ఇంటి దగ్గర ఎవరూలేని సమయంలో విపరీతంగా మద్యం సేవించి, మద్యం మత్తులో కత్తితో తన పీక కోసుకున్నాడు. ఇక రాత్రి ఎవరూ చూడక పోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అయితే ఉదయాన్నే ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యలు పేరూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం 108 సహాయంతో ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.



Next Story