భర్త మెజార్టీని దాటేసిన సుధ.. బద్వేలులో వైసీపీకి తిరుగులేని విజయం

by  |
భర్త మెజార్టీని దాటేసిన సుధ.. బద్వేలులో వైసీపీకి తిరుగులేని విజయం
X

దిశ, వెబ్ డెస్క్: బద్వేల్ ఉపఎన్నికలో అధికార వైసీపీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఎనిమిది రౌండ్లు ముగిసే సమయానికి వైసీపీ అభ్యర్ధి దాసరి సుధ 68,492 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత వైసీపీ అభ్యర్ధి సుధ 84,682 ఓట్లు సాధించగా.. బీజేపీకి 16,190 ఓట్లు, కాంగ్రెస్‌కు 5026 ఓట్లు వచ్చాయి. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు 2019లో 44,734 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో భర్త మెజారిటీని భార్య దాసరి సుధ క్రాస్ చేసింది. అటు, బీజేపీ గతం కంటే మెరుగైన ఫలితం సాధించింది.



Next Story

Most Viewed