నన్ను చంపాలని చూస్తున్నారు..

by  |
నన్ను చంపాలని చూస్తున్నారు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సుదర్శన్ అనే యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్, పీఏ చైతన్య తనను వేధిస్తున్నారని, హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు.

ఈ నేపథ్యంలోనే సెల్‌టవర్ ఎక్కిన సుదర్శన్ తనకు రక్షణ కల్పించాలని కోరుతూ నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed