- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. మహిళలకోసం ఎన్ని చట్టాలు వచ్చినా.. లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సబ్ రిజిష్టార్ అటెండర్ పై లైంగిక దాడి చేసిన ఘటన జిల్లాలోని ఏలూరులో చోటు చేసుకుంది. ఏలూరులోని రిజిస్టార్ ఆఫీస్లోని ఆడిట్ సెక్షన్లో కొన్ని రోజుల నుంచి ఓ వివాహిత అటెండర్గా పనిచేస్తుంది. ఆమెపై కన్నేసిన సబ్ రిజిష్టార్ జయరాజు అనే వ్యక్తి రోజు తనను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో శనివారం రోజు మరోసారి తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు. అతని వేధింపులు తాళలేక సదరు మహిళ రిజిస్టార్ ఆఫీసులో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు మరోసారి ఇది రిపీట్ కాకూడదంటూ జయరాజును మందలించారు.. తాను ఫిర్యాదు చేసిందన్న కోపంతో మరోసారి అంటెండర్పై లైంకిగ దాడికి యత్నించాడు. నా కోరిక తీర్చకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది, దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.