భార్య, అత్తమామలపై ఎస్సై దాడి.. మరో యువతితో ఎఫైర్..?

by  |
భార్య, అత్తమామలపై ఎస్సై దాడి.. మరో యువతితో ఎఫైర్..?
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్య, అత్తమామలపై ఓ ఎస్సై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..లావణ్య అనే యువతిని 2017లో ప్రేమవివాహం చేసుకున్నాడు ఎస్సై నాగార్జున. రెండేండ్లు బాగానే సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా కలతలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్యను దూరం పెడుతూ వచ్చిన ఎస్సై నాగార్జున 2019లో విడాకుల కోసం అప్లై చేశాడు. నాటి నుంచి కేసు ట్రయల్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం కోర్టు ప్రాంగణంలో ఎస్సై తన భార్యపై దాడికి యత్నించాడు.

అడ్డం వచ్చిన అత్తమామలపై కూడా దాడి చేశాడు. గాయాలపాలైన లావణ్యను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, మరో యువతితో ఎఫైర్ పెట్టుకుని తనకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని ఎస్సై భార్య ఆరోపించింది. ప్రస్తుతం నాగార్జున గురజాల పీఎస్‌లో విధులు నిర్వహిస్తుండగా అధికారులు వీఆర్‌కు పంపారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story