కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు

by  |
కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కొత్త జిల్లాలో ఏర్పాటుపై సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీకి ప్రభుత్వం మరో నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ, అదేవిధంగా నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనం చేసేందుకు మరో సబ్ కమిటీ, ఆస్తులు, మౌలిక సదుపాయాలు అధ్యాయనం చేసేందుకు ఇంకో కమిటీ, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి ఇంకొక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

అదేవిధంగా జిల్లా స్థాయి కమీటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో చైర్మన్ గా కలెక్టర్, ఇతర 10 మంది సభ్యులు ఉండనున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Next Story