భారతదేశంలో రైతు ఉద్యమాలు(జనరల్ స్టడీస్-గ్రూప్స్ స్పెషల్)

by Disha Web Desk 17 |
భారతదేశంలో రైతు ఉద్యమాలు(జనరల్ స్టడీస్-గ్రూప్స్ స్పెషల్)
X

తూర్పు భారతదేశంలో రైతు ఉద్యమాలు :

గోవిందాపూర్‌(1859-60) (కలకత్తా దగ్గర) -విష్ణు బిశ్వాస్‌, దిగంబర బిశ్వాస్‌.

పాబ్నా (1874) (పశ్చిమ బెంగాల్‌లో)-కుడిమల్ల ఇషాన్‌చంద్రరాయ్‌

హరీష్‌ చంద్రముఖర్జీ హిందూ పేట్రియాట్‌ అనే పత్రిక ద్వారా రైతుల సమస్యలను తెలియజేసేవాడు.

దీనబంధుమిత్ర నీల్‌దర్పణ్‌ అనే నాటకం ద్వారా బ్రిటీష్‌ వారి అణచివేత విధానాలను, రైతుల సమస్యలను తెలియజేసేవాడు.

ఉత్తర భారతదేశం:

ఉత్తరప్రదేశ్‌ కిసాన్‌ సభ(1918) :

గౌరీశంకర్‌మిశ్రా, ఇంద్రనారాయణ్‌ త్రివేదిలు స్థాపించారు. మదన్‌మోహన్‌మాలవ్య ఇందులో సభ్యుడిగా చేరి దీని 500 శాఖలను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేశాడు.

ఆల్‌ ఇండియా కిసాన్‌సభ (1936):

స్వామి సహజానంద, ఎన్‌.జి.రంగాలు స్థాపించారు.

దీని మొట్టమొదటి సమావేశం లక్నోలో జరిగింది.

ఎన్‌.జి.రంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల శిక్షణ కొరకు నిడుబ్రోలు వద్ద ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

సమావేశాలు:

1936 -లక్నో

1987 - ఫైజ్‌పూర్‌

1938 - కోమిల్లా (వ్యవసాయ విప్లవ తీర్మానం చేశారు)

ఆరంబాన్‌ గాంధీ అని ప్రపుల్లాసేన్‌ అంటారు.

గోరఖ్‌పూర్‌ గాంధీ అని బాబా రాథువదాన్‌ను పేర్కొంటారు.

బాబా రామచంద్ర :

20వ శతాబ్ద ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌లో రైతు ఉద్యమాలను చేపట్టాడు.

ఇతను అవధ్‌ కిసాన్‌ సభను ఏర్పాటు చేశాడు.

మదర్‌ పార్శి :

ఇతను ఉత్తరప్రదేశ్‌లో ఎకా ఉద్యమాన్ని చేపట్టాడు.

పంజాబ్‌ నవజవాన్‌ భారత్‌ సభ :

దీన్ని 1926లో భగత్‌సింగ్‌, యశళ్‌పాల్‌, చబిల్‌దాస్‌ స్థాపించారు.

పంజాబ్‌ రైతు ఉద్యమ కాలంలో బంకా దయాళ్‌ రచించిన 'పగిడి సంబాల్‌ ఓ జట్టా' అనే పాట అత్యంత ఆదరణ పొందింది.

పశ్చిమ భారతదేశం :

గుజరాత్‌ :

భఖేదా(1917-18) : మోహన్‌లాల్‌ పాండ్యా, తర్వాత గాంధీజీ చేపట్టాడు.

బోర్సాద్‌ (1924) : వల్లభాయపటేల్‌ నేతృత్వం

బర్జోలి (1928) : ముందుగా పట్టీదార్‌ యువక్‌ మండలి సభ్యులు కున్వర్‌జీ మెహతా, కల్యాణ్‌జీ మెహతా (పంటకు సరైన మద్దతు ధర కోనం) చేపట్టాక, తర్వాత వల్లభాయ్‌పటేల్‌ నేతృత్వం వహించాడు.

మహారాష్ట్ర :

ఎం.జి.రనడే స్థాపించారు.

ఎం.జి.రనడే-గోఖలేకు గురువు

రామోసిస్‌(1879) : బల్వంతపాడ్కే చేపట్టాడు.

ఇతనిని Father of Indian Militant Nationalism అంటారు

వాసుదేవ బల్వంత్‌ పాడ్కే శిష్యులు - తిలక్‌, చాపేకర్‌ సోదరులు (బాలకృష్ణ దామోదర్‌)

దక్షిణ భారతదేశం :

మోప్లా(1921-22): మలబార్‌ ప్రాంతం(కేరళలో కున్‌అహ్మద్‌ హజ్‌ చేపట్టాడు.

కానీ మత పరమైన కారణాలు పేర్కొంటూ బ్రిటీషు వారు దీనిని అణచివేశారు.


ఇవి కూడా చదవండి:

HAL లో 178 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు



Next Story

Most Viewed