బ్రిటిష్ సామ్రాజ్య వాదం: ఆధునిక భారతదేశ చరిత్ర (గ్రూప్ -2,3,4/ఎస్ఐ, కానిస్టేబుల్)

by Disha Web Desk 17 |
బ్రిటిష్ సామ్రాజ్య వాదం: ఆధునిక భారతదేశ చరిత్ర (గ్రూప్ -2,3,4/ఎస్ఐ, కానిస్టేబుల్)
X

1757 ప్లాసీ యుద్ధం ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదం ఏర్పడుటకు పునాదులు వేసింది.

ప్లాసీ యుద్ధం మొదటి విప్లవంగా పిలవబడింది.

ఈ యుద్ధంతో వర్తక వాణిజ్యం కొరకు భారతదేశానికి వచ్చిన ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ ఒక ప్రాదేశిక శక్తిగా అవతరించింది.

బ్రిటిష్ వారు బలపడటానికి మొదటి కారణం తిరుగులేని నౌకాధిపత్యం కలిగి ఉండటమే.

1760 వందవాసి యుద్ధంలో బ్రిటిష్ వారు తమ నౌకాధిపత్యంతో శత్రువులైన ఫ్రెంచ్ వారిని ఓడించారు.

దీంతో భారతదేశంలో ఏ ఐరోపా దేశం కూడా బ్రిటీష్‌తో పెట్టుకోకుండా తిరుగులేని ఆధిపత్యం సాధించారు.

ఆంగ్లేయులు వ్యూహాత్మకంగా ఏర్పరచుకున్న స్థావరాలు కూడా వారి ఆధిపత్యానికి దారితీశాయి.

దక్షిణాన మద్రాస్ ప్రెసిడెన్సీ, తూర్పున బెంగాల్ ప్రెసిడెన్సీ, పశ్చిమాన బాంబే ప్రెసిడెన్సీలను ఏర్పరచుకొని ఒక ప్రణాళికా బద్ధంగా తమ విస్తరణను సాగించారు.

స్వదేశీ పాలకుల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వీరి ఆధిపత్యానికి ప్రోత్సాహాన్నిచ్చింది.

బ్రిటిష్ వారు తొలిసారిగా కర్ణాటక ప్రాంతంలో అన్వరుద్దీన్, చందాసాహెబ్ మధ్య తలెత్తిన వివాదాల్లో జోక్యం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో ప్రారంభమైన అంతరయుద్ధంలో నాసర్‌జంగ్‌కు మద్దతు పలికి క్రమంగా నిజాం అలీ కాలంలో ఉత్తర సర్కారును పొందారు.

కుట్రలు కుతంత్రాలు వంటి విధానాలతో కూడిన దౌత్యనీతి వీరి ఆధిపత్యానికి తోడ్పడింది.

బెంగాల్ ఆక్రమణలో రాబర్ట్‌క్లైవ్ కుట్రతో నవాబు సిరాజ్‌ను ప్లాసీ యుద్ధంలో ఓడించాడు.

బ్రిటీష్ వారు అనుసరించిన విధానాలు మూలంగా లార్డ్ వార్న్‌హేస్టింగ్స్ తన కంచవలయ విధానంతో విజయవంతమయ్యాడు.

లార్డ్ వెల్లస్లీ తన సైన్య సహకార విధానంతో భారతదేశంలో అత్యంత బలవంతుడైన మరాఠ కూటమిని నిర్వీర్యం చేశాడు.

లార్డ్ డల్హౌసీ దత్త సంక్రమణ విధానం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి పరాకాష్ట గా చెప్పవచ్చు.

ఈ విధానం కింద డల్హౌసి సతార, జైత్‌పూర్, సంబల్‌పూర్, ఉదయ్‌పూర్ భగత్, ఝాన్సీ, నాగ్‌పూర్ లను ఆక్రమించాడు.

మొఘల్ చక్రవర్తి అసమర్ధత కూడా ఆంగ్లేయుల ఆధిపత్యానికి దారి తీసింది.

1764 బక్సర్ యుద్ధం లో ఓడిపోయిన మొఘల్ చక్రవర్తి షా ఆలం 1765 అలహాబాద్ సంధి ద్వారా ఆంగ్లేయులకు దివానీ హక్కులు అందించాడు.

దీంతో అత్యంత ఐశ్వర్య వంతమైన బెంగాల్ వనరులను తమ సామ్రాజ్యవాదానికి వినియోగించుకున్నారు.

తిరుగుబాట్లు

19వ శతాబ్దం ప్రథమార్థం నాటికి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదం పూర్తయింది.

బ్రిటిష్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో పౌర తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి. అవి

1. సన్యాసుల తిరుగుబాటు(1772)

బెంగాల్‌లోని గిరి శాఖకు చెందిన సన్యాసులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో వీరు మొట్టమొదటి సారిగా తిరుగుబాటు చేసిన వారయ్యారు.

సన్యాసులు దిగంబరంగా పుణ్య క్షేత్రాలను దర్శించడాన్ని నిషేధించడం వల్ల తిరుగుబాటు తలెత్తింది.

1772 బెంగాల్ కరువు కూడా తిరుగుబాటుకు కారణమైంది.

బంకించంద్ర ఛటర్జీ తన ఆనందమఠ్ నవలలో ఈ తిరుగుబాటును గురించి ప్రస్థావించాడు.

2. ఫరాజి ఉద్యమం:

1805లో పశ్చిమ బెంగాల్ లోని ఫరిద్‌పూర్ జిల్లాలో షరియత్ తుల్లా, హహ్మద్ మోహసిన్ ల ఆధ్వర్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది.

హిందూ భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ముస్లిం వ్యవసాయ కూలీలను సంఘటిత పరిచారు.

చివరికి ఇది హిందూ ముస్లిం మతపరమైన ఘర్షణ గా మారింది.

3. వహాబీ ఉద్యమం..

అబ్దుల్ వహబ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. భారతదేశంలో తిరిగి ముస్లింల పాలనకు పునరుద్దరించుటకు ఉద్యమం పిలుపు నిచ్చింది.

పంజాబ్‌లో సిక్కులను, భారతదేశంలో ఆంగ్లేయులను వ్యతిరేకించుటకు పూనుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సయ్యద్ అహ్మద్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు.

ఉద్యమం హిందూ ముస్లిం ఐక్యతను చాటింది.

ఈ ఉద్యమంలో వహాబీలు కీలక పాత్ర పోషించారు.

తిరుగుబాటు విఫలం అవ్వడంతో ఉద్యమం అంతరించింది.

4. కూకా ఉద్యమం..

పంజాబ్‌లో నామ్‌దారీ ఉద్యమం ఒక సంస్కరణ వాద ఉద్యమంగా భగత్ జవహరిమల్ ఆధ్వర్యంలో 1842లో ప్రారంభమైంది.

సిక్కు సమాజంలో తలెత్తిన అసమానతలను వ్యసనమైన తాగుడును ఉద్యమం వ్యతిరేకించింది.

ఈ ఉద్యమం రాంసింగ్ ఆధ్వర్యంలో పంజాబ్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగింది.

ఈ ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ వారిని వ్యతిరేకించే కూకా ఉద్యమంగా మారింది.

కూకాలు గురుగోవింద్‌ను మాత్రమే నిజమైన సిక్కు గురువుగా పరిగణిస్తారు.

1870లో రామ్‌సింగ్ కూడా తిరుగుబాటు నిర్వహించి అమృత్‌సర్‌లో కూకా ప్రభుత్వాన్ని ఏర్పరచినారు.



Next Story

Most Viewed