నవంబర్ 5లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి !

by  |
నవంబర్ 5లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీలకు నవంబర్ 5లోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని దోస్త్ కన్వీనర్ లింబాద్రి సూచించారు. దోస్త్ మూడు ఫేజ్‌ల్లో కలిపి 1,87,709 మంది సెల్ప్ రిపోర్ట్ చేశారని శనివారం ఆయన తెలిపారు. స్పెషల్ ఫేజ్‌లో 23,971 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా..21,437 మందికి సీట్లు కేటాయించినట్టు తెలిపారు. కాలేజీలకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థుల సీట్లు రద్దు చేయబడతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు సమాచారం, ఏవైనా ఇబ్బందుల ఉంటే దోస్త్ కార్యాలయం ఫోన్ నెంబర్ 040-40101416 లో సంప్రదించాలని సూచించారు.

Next Story

Most Viewed