ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన..

by  |
student
X

దిశ, కూకట్​పల్లి: ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ నాయకులు శుక్రవారం జేఎన్​టీయూహెచ్​లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్సిటిలోని వీసీ చాంబర్‌ను ముట్టడించడానికి యత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు, దీంతో పోలీసులు ఏబీవీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.దీంతో విద్యార్థి నాయకులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్​ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నాగరాజు, రోషన్, సునీల్, శశి, మున్నా, దయాకర్, అవినాష్, భరత్, గోపాల్, క్రాంతి, ప్రతీక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed