మూడు సబ్జెక్ట్‌లలో ఫెయిల్.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

by  |
మూడు సబ్జెక్ట్‌లలో ఫెయిల్..  ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని నగర శివారులోని అర్సపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ధనూష్(16) అనే విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాల‌లో ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఫలితాల్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ కావడం‌తో మనస్థాపానికి గురై ఆత్మహత్య‌కు పాల్పడినట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed