తల్లి మందలించిందని.. కొడుకు ఆత్మహత్య

by  |
తల్లి మందలించిందని.. కొడుకు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : చదువు సంధ్యా లేకుండా ఆవారాగా తిరుగుతున్న కొడుకును తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పీఎస్ పరిధి నల్లగండ్లలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. సంతోష్ కుమార్ అనే వ్యక్తి చదువు మధ్యలో ఆపేసి బలాదూర్ తిరుగుతున్నాడు.

కొడుకు భవిష్యత్‌పై ఆందోళన చెందిన తల్లి పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతనిలో ఏ మార్పు రాలేదు.దీంతో కొంచెం గట్టిగా మందలించడంతో సంతోష్ ఎవరికీ చెప్పకుండా నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు.చీకటి పడినా తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలింపు చర్యలు చేపట్టగా మొబైల్ లొకేషన్ ఆధారంగా నల్లగండ్లలో సంతోష్ మృతదేహాన్ని గుర్తించారు. పక్కనే పెట్రోల్ బాటిల్‌ను కనిపించడంతో తల్లి మందలించడం వలన మనస్థాపం చెంది అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Next Story

Most Viewed