‘సెల్’ కొనివ్వలేదని.. విద్యార్థి సూసైడ్

by  |
‘సెల్’ కొనివ్వలేదని.. విద్యార్థి సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి సెల్‌ఫొన్ కొనివ్వలేదనే మనస్థాపంతో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని బీర్‌పూర్ మండలం, కొల్వాయిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆకుల సాయిరాం (15) ఆన్ లైన్ క్లాసుల కోసమని మొబైల్ కొనివ్వాలని తండ్రి కోరాడు.

ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఇప్పుడు కొనివ్వలేనని చెప్పడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed