ఫ్లైఓవర్ దిమ్మెను బలంగా ఢీకొట్టిన విద్యార్థి.. శరీరం నుంచి ఊడిపోయిన ఎడమ కాలు

by Vadlamudi Anukaran |   (  Updated:2021-12-14 21:45:16  IST  )

<p>దిశ, మిర్యాలగూడ: పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న ప్రమాదంలో వడ్డేరిగూడెంకు చెందిన గట్టిగొర్ల గౌతమ్(16) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్-లక్ష్మి దంపతుల కుమారుడైన గౌతమ్ రాత్రి 9 గంటల సమయంలో ఫ్రెండ్ తో కలిసి బైక్ పై వెళ్లి ఫ్లైఓవర్ దిమ్మెను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడి ఎడమ కాలు [&hellip;]</p>

Studen-died-at-road-acciden
X

దిశ, మిర్యాలగూడ: పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న ప్రమాదంలో వడ్డేరిగూడెంకు చెందిన గట్టిగొర్ల గౌతమ్(16) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్-లక్ష్మి దంపతుల కుమారుడైన గౌతమ్ రాత్రి 9 గంటల సమయంలో ఫ్రెండ్ తో కలిసి బైక్ పై వెళ్లి ఫ్లైఓవర్ దిమ్మెను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడి ఎడమ కాలు శరీరం నుంచి ఊడిపోయి నడుం భాగం ఛిద్రం అయింది. బైక్ పై ఉన్న మరో విద్యార్థికి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story