డీమార్ట్ వద్ద విద్యార్థి మృతి…

by  |
డీమార్ట్ వద్ద విద్యార్థి మృతి…
X

డీమార్డ్ దగ్గర విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. స్నేహితులతో కలిసి రాత్రి షాపింగ్‌కు వెళ్లిన సతీష్‌కు, డీమార్ట్ సెక్యూరిటీకి మధ్య వివాదం జరిగింది. దీంతో ఇరువురు పోట్లాడుకున్నారు. సెక్యూరిటీ కొట్టిన దెబ్బల వల్లే తమ కుమారుడు మృతిచెందాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హయత్‌నగర్‌లోని శ్రీచైతన్య కాలేజీలో సతీశ్ ఇంటర్ చదువుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed