నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్పీ రంగనాథ్

by  |

దిశ, నల్గొండ: లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. జిల్లాలోని కంటైన్‌మెంట్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కరోనా వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తున్నందున జిల్లాస్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతాన్ని కూడా కంటైన్‌మెంట్‌గా ప్రకటించి వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఈదులగూడ కాలనీలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మహిళతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించి వారికి ముద్ర వేసి క్వారంటైన్​కు పంపారు. వారిని బయటకు వెళ్లకుండా చూసుకోవాలని పోలీసులు, వైద్యాధికారులకు ఎస్పీ రంగనాథ్ సూచించారు.

Tags: SP ranganath, Strict, violations, regulations, nalgonda


Next Story

Most Viewed