కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షలు

by  |
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృభన కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 403 కరోనా కేసులో నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. నిన్నటితో పోలిస్తే 132 కేసులు తగ్గాయి. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మాస్క్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నివారించడానికి హోలీ వేడుకలలో ఆంక్షలు విధించారు, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం, మూకుమ్మడిగా వాహనాల పై తిరగడం రద్దు. ఒక వేళ ఏవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed