అర్థం చేసుకోండి.. బయటకు వస్తే కఠిన చర్యలు : సీపీ అంజనీ కుమార్

by  |
అర్థం చేసుకోండి.. బయటకు వస్తే కఠిన చర్యలు : సీపీ అంజనీ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, కొందరు మాత్రం లాక్‌డౌన్ తమకు పట్టదన్నట్టుగా రూల్స్ బ్రేక్ చేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీ అంజనీ కుమార్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం నిరంతరం పని చేస్తు్న్నట్టు తెలిపారు. ఈ విషయం అర్ధం చేసుకుని ప్రజలు కచ్చితంగా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు పాటించకుండా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story

Most Viewed