హైదరాబాద్ జిల్లా రెడ్ జోన్ కాదు: కలెక్టర్

by  |

దిశ, హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో ఏ ప్రాంతాన్ని రెడ్ ‎జోన్‎గా ప్రకటించలేదని కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఫిలింనగర్‎లో పాజిటివ్ కేసులు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వ సూచనలను ప్రజలు విధిగా పాటించాలన్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కలెక్టర్ హెచ్చరించారు.

Tags: Corona Virus Fake Publicity, Hyderabad Collectorate, Collector Shweta Mahamanthi

Next Story

Most Viewed