- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మోత్కూరు: తమకున్న సొంత కుంటలో చేపలు పడుతుండగా ఓ వింత చేప జాలర్లకు చిక్కిన సంఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రం పరిధిలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన జింకల యాకన్నకు మంగలి గడ్డ లో వ్యవసాయ భూమి ఉంది. అయితే తమకున్న వ్యవసాయ భూమి నుండి మోత్కూర్ గుండాల రహదారి కోసం మట్టిని తరలించగా కుంట ఏర్పడింది.
ఈ క్రమంలో భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో దేవాదుల ప్రాజెక్టు నుండి విడుదలై నవాబుపేట రిజర్వాయర్ ద్వారా వచ్చిన జలాలను పిల్ల కాలువ ద్వారా కుంటను నింపారు. వేసవికాలం కావడంతో ఆ కుంటలో నీళ్లు తగ్గిపోవడంతో అందులో ఉన్న చేపలు పట్టడానికి ప్రయత్నించగా ఆ చేపలతో పాటు ఈ వింత చేప లభించిందని అతను తెలిపారు. మామూలు చేపలకు భిన్నంగా నోరు రంగు ఉండటంతో ఆ చేపగురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు.
Next Story