మేరీ మాత, జీసస్ విగ్రహాలు ధ్వంసం 

by  |
మేరీ మాత, జీసస్ విగ్రహాలు ధ్వంసం 
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మేరీ మాత, జీసస్ విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. మెయిన్ రోడ్డులోని ఆర్సీఎం చర్చి గేటు దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

హిందూ దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఎవరో కక్ష్యపూరితంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు మత విద్వేషాలకు దారితీస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Next Story