- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ: నేటి నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్ 4.0 నిబంధనల్లో అనేక సడలింపులనిచ్చామని, వీటికి అదనంగా మరిన్ని మినహాయింపులివ్వరాదని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అవసరమైతే.. అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఆంక్షలు విధించే అధికారాన్ని ఇచ్చినట్టు వివరించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. సోమవారం ఈ లేఖ రాశారు. ఇదివరకే చెప్పినట్టు లాక్డౌన్ 4.0 నిబంధనలను సడలించరాదని, అవసరాల మేరకు కొన్ని సేవలను రద్దు చేసుకునే వెసులుబాటు మాత్రమే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నదని ఆయన పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే వైరస్ను ఓడించగలమని తెలిపారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఆరెంజ్ జోన్లను నిర్ణయించడానికి సంబంధించిన అధికారాలను రాష్ట్రాలకే అప్పజెప్పిన సంగతి తెలిసిందే.