కేంద్ర సాయం రాష్ట్రాలే పర్యవేక్షించాలి

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈ‌లకు ప్రకటించిన ఆర్థికసాయం అమలుపై రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. కేంద్రం ఎమ్మెస్ఎంఈలకు ప్రకటించిన ఆర్థిక‌సాయంపై పర్యవేక్షణ బాధ్యత రాష్ట్రాలకు ఉండాలని ఆయన అన్నారు. ఆర్ధిక సాయం నియంత్రణకు ప్రత్యేక మెకానిజం ఉంటే.. దానికి పూర్తి సార్థకత చేకూరుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీ‌లో మొదటి విడతగా రూ.4 లక్షల కోట్ల ప్రకటన కేంద్రం చేసిందని.. అయితే ఆరోగ్యం విషయంలో మొదట ప్రకటన చేయాల్సిందని అన్నారు.


Next Story

Most Viewed