మావోల కోసం వేట.. రంగంలోకి డీజీపీ

by  |
మావోల కోసం వేట.. రంగంలోకి డీజీపీ
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో మావోల క‌ద‌లిక‌లు పెర‌గ‌డంతో పోలీస్‌శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. దీంతో మావోయిస్టుల కోసం ఏకంగా రాష్ట్ర డీజీపీనే స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. ఈ క్ర‌మంలో శ‌నివారం రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి ప్ర‌త్యేక హెలికాఫ్టర్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చేరుకున్నారు. అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో సింగరేణి గెస్ట్‌హౌస్‌లో సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. మీడియాకి అనుమతి నిరాక‌రించారు. మూడ్రోజుల క్రితం మ‌ణుగూరు, క‌ర‌క‌గూడెంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగిన విష‌యం తెలిసిందే.

Next Story