మమ్మల్ని రెగ్యులర్ చేయండి

by  |
మమ్మల్ని రెగ్యులర్ చేయండి
X

దిశ, అమరావతి బ్యూరో: తమను రెగ్యులర్ చేయాలని ఒప్పంద స్టాఫ్ నర్సులు ఆందోళన బాట పట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనుభవం, వయసు ఆధారంగా శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఆందోళన చేస్తున్న నర్సులకు పోలీసులు సర్ది చెప్పారు.

Next Story