కరెంటు కోతలు..సిబ్బందికి తిప్పలు

by  |
కరెంటు కోతలు..సిబ్బందికి తిప్పలు
X

దిశ, మెదక్

ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో డెలివరీకి వచ్చిన వారు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. మిరుదొడ్డి మండలం భూంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో దీపాలు పెట్టుకొని మరీ వైద్యం అందిస్తున్నారు. కనీసం ఇన్వెర్టర్ సౌకర్యం లేకపోవటంతో సిబ్బందికి తిప్పలు తప్పటం లేదు. మంగళవారం రాత్రి పది గంటలకు దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామం నుంచి ఓ గర్బిణీ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. కరెంట్ లేకపోవటంతో బాధితురాలిని సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. భూంపల్లి గ్రామంలో కరెంట్ ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండటం లేదు. ప్రభుత్వ వైద్యాధికారి నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags: Medak, Bhoompally, Govt Hospital, struggling, Power problem


Next Story

Most Viewed