నీవు మాతో లేకపోయినా.. నీ కుటుంబానికి మేమున్నామంటూ..!

by  |
నీవు మాతో లేకపోయినా.. నీ కుటుంబానికి మేమున్నామంటూ..!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాగా బజారుకు చెందిన నరసింహ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. అయితే, అతని కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. బాదేపల్లిలోని బాలుర ఉన్నత పాఠశాలలో SSC వరకు చదువుకున్న 1991 బ్యాచ్‌కు చెందిన నరసింహ మిత్రులు మృతుడి కూతురు పేరిట లక్ష రూపాయల డిపాజిట్ చేసి శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేశారు.

నరసింహ కుటుంబ పరిస్థితులను గమనించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తనవంతుగా 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అప్పటికప్పుడు అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ కూడా కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తమ మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పూర్వ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story