- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. ముక్కోటి ఏకాదశి కావడంతో శుక్రవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చింది. లాక్డౌన్ తర్వాత హుండీ ఆదాయం ఈ స్థాయికి చేరడం ఇదే మొదటి సారి అని అధికారులు తెలిపారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4కోట్లకుపైగా రావడం ఈ నెలలో ఇదే తొలిసారి. కాగా ఇప్పటికే ఈ నెలలో హుండీ ఆదాయం నాలుగు సార్లు 3 కోట్లకు పైగా వచ్చింది. శ్రీ వారి దర్శనానికి సర్వ దర్శనం టోకెన్లను కూడా జారీ చేస్తున్నారు. దీంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మరో పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం ఉండటంతో హుండీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Next Story