ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదు: శ్రీరంగనాథరాజు

by  |
ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదు: శ్రీరంగనాథరాజు
X

దిశ, ఏపీ బ్యూరో: గత కొద్ది కాలంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి.. తాను, తన కుమారుడు దొంగలంటూ వ్యాఖ్యానించి.. కేంద్ర బలగాలతో భద్రత కావాలంటూ లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడంపై ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. రఘురామకృష్ణం రాజు నియోజక వర్గానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. 15 లక్షల మంది ప్రజల ప్రతినిధి అయిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. ఆయన ప్రాణహాని ఉందనడం ఆశ్చర్యకరమన్న మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఫ్యాక్షన్ ఏరియా కాదన్న విషయం గుర్తించాలని సూచించారు.

Next Story

Most Viewed