కరోనా వారియర్స్ అవార్డు అందుకున్న శ్రీకాంత్ గౌడ్

by  |
కరోనా వారియర్స్ అవార్డు అందుకున్న శ్రీకాంత్ గౌడ్
X

దిశ, నెల్లికుదురు: జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ అధ్వర్యంలో శనివారం హైదరబాద్‌లోని తెలంగాణ సరస్వత పరిషత్ హబిడ్స్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో విశిష్ట సేవ పురస్కార్ కరోనా వారియర్ అవార్డ్స్ ను మండలంలోని చిన్న నాగారం గ్రామానికి చెందిన ఎన్. సి. ఆర్. సి తెలంగాణ చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ కు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఎన్. సి . ఆర్ .సి వ్యవస్తాపక చైర్మన్ ఎంవీల్ నాగేశ్వర రావు చేతుల మీదుగా ఎన్. సి .ఆర్. సి జాతీయ ,రాష్ట్ర బాధ్యుల చేతుల మీదగా ప్రదానం చేశారు.

ఈ సందర్బంగా ఇక్కడ విలేకరులతో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్ .సి.ఆర్. సి సేవలను ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేసేలా పని చేస్తానని, పుర్తిగా నిర్మాణం పైన దృష్టి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా కమిటీలను పుర్తి చేసి వినియోగదారుల హక్కులను రక్షించటం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో ఒక వారధిగా పనిచేసి వినియోగదారుడి హక్కులకు కాపాడుతామని తెలియజేశారు. వస్తుసేవల నాణ్యతలో ఇలాంటి ఇబ్బంది ఎదురైనా ఎన్. సి. ఆర్. సి ని ఎప్పుడైనా ఆశ్రయించవచ్చని తెలియజేశారు.


Next Story

Most Viewed