తరుగు పేరిట రైతులను ముంచుతున్నారు: శ్రీధర్ బాబు

by  |
తరుగు పేరిట రైతులను ముంచుతున్నారు: శ్రీధర్ బాబు
X

దిశ, కరీంనగర్: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు మోసాలకు పాల్పడుతూ రైతులను నిట్టనిలువుగా ముంచుతున్నారని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆరోపించారు. మంథని నియోజకవర్గంలోని రైతులను దగా చేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. క్వింటాల్ బియ్యానికి 8 కిలోల వరకు తరుగు పేరిట కోత విధిస్తున్నారని, రైతులకు ఎలాంటి రసీదు కూడా ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. రైతులకు న్యాయం చేసే విధంగా చొరవ తీసుకోవాలనిమంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డిలకు శ్రీధర్ బాబు. లేఖ రాశారు.

Tags: Sridhar Babu, allegations, grain purchase, karimnagar

Next Story

Most Viewed