శ్రీవిష్ణు ‘డొనేట్ ప్లాస్మా’ చాలెంజ్

by  |
శ్రీవిష్ణు ‘డొనేట్ ప్లాస్మా’ చాలెంజ్
X

ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా పలు చాలెంజ్‌ల పర్వం నడుస్తోంది. ప్రస్తుతం గ్రీన్ ఇండియా చాలెంజ్ వైరల్ కాగా.. లాక్‌డౌన్‌ టైమ్‌లో ‘బి ది రియల్ మెన్ చాలెంజ్’ వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం హీరో శ్రీవిష్ణు ఒక మంచి ప్రయత్నంతో సరికొత్త చాలెంజ్‌కు శ్రీకారం చుట్టాడు.

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని కాపాడేందుకు ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే కరోనాతో బాధపడుతున్న కొందరినైనా కాపాడుకోవచ్చు. కాబట్టి దీనిపై అవగాహన కల్పిస్తూ ‘డొనేట్ ప్లాస్మా అండ్ సేవ్ లైఫ్’ పేరుతో ట్విట్టర్ డీపీ సెట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ చాలెంజ్ అందరూ స్వీకరించాలని కోరిన శ్రీ విష్ణు.. నారా రోహిత్, నివేదా థామస్‌ను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేశాడు.


Next Story

Most Viewed