‘మా దేశానికి రావొద్దు’

by  |
‘మా దేశానికి రావొద్దు’
X

కొలంబో : భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో విదేశాలు మనదేశం నుంచి విమానయాన రాకపోకలను నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్, తైవాన్, హాంకాంగ్ వంటి దేశాలు భారత్‌పై బ్యాన్ విధించగా.. తాజాగా ఆ జాబితాలో మన పొరుగు దేశం శ్రీలంక చేరింది. ఈ మేరకు శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ గురువారం ఒక లేఖ విడుదల చేసింది. భారత్- శ్రీలంక మధ్య తిరిగే విమాన ప్రయాణాలపై పూర్తిగా నిషేధం విధించినట్లు తెలిపింది. భారత ప్రయాణీకులను తమ దేశంలోకి అనుమతించబోమని పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story

Most Viewed