రైతుల అరిగోస.. నిల్వ చేసిన ధాన్యంలో మొలకలు

by  |
రైతుల అరిగోస.. నిల్వ చేసిన ధాన్యంలో మొలకలు
X

దిశ, బోథ్: వర్షాకాలం మొదలు అయ్యింది.. రైతులు పొలం భూములను దుక్కి దున్నారు.. విత్తనాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ, రైతు కష్టాలు తప్పడం లేదు. జొన్నలు అమ్మి.. వచ్చిన డబ్బులతో ఇంకో పంటకి పెట్టుబడి పెడుదామంటే తమ ఆశలపై ప్రభుత్వం నీళ్లు పోసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పడించిన పంటను ఇంకా కొనుగోలు చేయలేదని వాపోతున్నారు భోథ్ మండల రైతులు. ప్రభుత్వ మద్ధతు ధర రూ. 2620 ప్రకటించినప్పటికీ.. ఇంకా కొనుగోలు మాత్రం చేయలేదని.. దీంతో ప్రైవేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రూ. 1000-1200లకు అమ్ముకోలేక నిల్వచేసిన ధాన్యంలో మొలకలు వచ్చాయని.. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిల్వచేసిన పంట మొత్తానికే చేతికిరాకుండా అవుతోందని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed