15 ఏళ్ల తర్వాత ఆ మ్యాచ్ చూసిన యువరాజ్ సింగ్.. రియాక్షన్ ఇదే (వీడియో)

by Disha Web Desk 2 |
15 ఏళ్ల తర్వాత ఆ మ్యాచ్ చూసిన యువరాజ్ సింగ్.. రియాక్షన్ ఇదే (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా vs ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రసవత్తర మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్ జరిగి నేటికి సరిగ్గా పదిహేనేళ్లు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా యువీ కొట్టిన సిక్సుల వీడియోలు పోస్టు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా.. ఈ మ్యాచ్‌పై యువీ కూడా స్పదించారు. ఇంట్లో టీవీలో తన కుమారుడితో ఆ మ్యాచ్‌ చూస్తూ గత సృతులను గుర్తుచేసుకున్నారు. అంతేగాక, "15 సంవత్సరాల తర్వాత కలిసి ఈ క్షణాలను చూడటానికి ఇంతకంటే మంచి భాగస్వామి దొరకలేదు" అని యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆ వీడియోపై స్పందిస్తూ "చిన్నవాడు నీ టెక్నిక్‌ని గమనిస్తున్నాడు" అంటూ రాసుకొచ్చాడు.



Next Story

Most Viewed