డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌‌కు అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ

by Disha Web Desk 13 |
డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌‌కు అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ
X

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లోని ఓవల్‌ స్టేడియంలో జూన్‌ 7 నుంచి 12 వరకు టీమ్ ఇండియా vs ఆసీస్ మధ్య జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌‌కు అంపైర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లతో సహా ఐదుగురు మ్యాచ్ అఫీషియల్స్‌ పేర్లను ఐసీసీ వెల్లడించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్‌ అంపైర్‌ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికవగా.. థర్డ్‌ అంపైర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో వ్యవహరించనున్నాడు. శ్రీలంకకు చెందిన సీనియర్‌ అంపైర్‌ కుమార్ ధర్మసేన ఫోర్త్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మ్యాచ్‌ రిఫరీగా వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం రిచీ రిచర్డ్‌సన్ వ్యవహరించునున్నాడు.

Next Story

Most Viewed